త్వరలో.. దేశీయ మార్కేట్లోకి హస్క్వర్నా బైక్స్
ముంబయి: బజాజ్ ఆటో… 250 సీసీ విభాగంలో హస్క్వర్నా బ్రాండ్ మోటార్సైకిల్స్ను వచ్చే నెలలో దేశీ మార్కెట్లోకి తీసుకురానున్నట్లు ప్రకటించింది. రెండు వేరియంట్లలో హస్క్వర్నా స్వార్ట్పైలెన్ 250, విట్పైలెన్ 250 బైక్స్ను మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. రూ.1.80 లక్షల (ఢిల్లీ ఎక్స్షోరూమ్) ఆరంభ ధరతో వీటిని విక్రయించనున్నట్లు బజాజ్ ఆటో తెలిపింది. గత ఏడాది డిసెంబరులో బజాజ్ ఆటో ఈ రెండు మోటార్సైకిల్స్ను ఆవిష్కరించింది.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/