తీన్మార్ మల్లన్నకు బెయిల్ మంజూరు

తీన్మార్ మల్లన్నకు బెయిల్ మంజూరు చేసింది మల్కాజ్ గిరి కోర్టు. తీన్మార్ మల్లన్నతో పాటు మరో నలుగురికి బెయిల్ మంజూరు చేసింది. ఒక్కొక్కరికి రూ.20వేలు ష్యూరిటీ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు న్యాయమూర్తి. రెండు కేసుల్లో రెగ్యూలర్ బెయిల్ ఇచ్చింది. రేపు తీన్మార్ మల్లన్న జైలు నుంచి విడుదల కానున్నారు. బెయిల్ కోరుతూ తీన్మార్ మల్లన్న మల్కాజ్ గిరి కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

ఇటీవల ఈ పిటిషన్ పై విచారించిన కోర్టు… తుది తీర్పును ఏప్రిల్ 17కు వాయిదా వేసింది. అదేవిధంగా ఏప్రిల్12న రెండో కేసు బెయిల్ పిటిషన్ పై మల్లన్న న్యాయవాది కోర్టుకు వివరాలు సమర్పించారు. అదే రోజు బెయిల్ పై ఆదేశాలు ఇవ్వాలని కోరారు. అయితే బెయిల్ పై తుది తీర్పును ఏప్రిల్ 17న ఇస్తామని గతంలో కోర్టు తెలిపింది. దీంతో ఇవాళ తుది తీర్పు ఇచ్చారు న్యాయమూర్తి. తీన్మార్‌ మల్లన్నపై తెలంగాణ వ్యాప్తంగా 90 కేసులు పెట్టారు.