బిజెపిలో చేరిన బ్యాడ్మింటన్ సైనా నెహ్వాల్

బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ సమక్షంలో బిజెపిలోకి

Saina Nehwal Joins BJP
Saina Nehwal Joins BJP

న్యూఢిల్లీ: భారత స్టార్ బ్యాడ్మింటన్ సైనా నెహ్వాల్ బిజెపిలో చేరారు. ఢిల్లీలోని బిజెపి ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ పెద్దలతో ఆమె ఈ రోజు ఉదయం సమావేశమయ్యారు. అనంతరం బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ సమక్షంలో బిజెపి కండువా కప్పుకున్నారు. ఆమె తమ పార్టీలోకి రావడం శుభసూచికమని అరుణ్ సింగ్ అన్నారు. ఆమెకు బిజెపి సభ్యత్వాన్ని ఇచ్చారు. సైనాతో పాటు ఆమె సోదరి చంద్రాన్సూ నెహ్వాల్ కూడా బిజెపిలో చేరారు. ఈ సందర్భంగా సైనా మాట్లాడుతూ.. దేశాభివృద్ధి కోసం రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు. క్రీడల అభివృద్ధికి మోడి కృషి చేస్తున్నారని, అందుకే బిజెపిలో చేరానని అన్నారు. మోడి నేతృత్వంలో పని చేసేందుకు ఉవ్విళ్లూరుతున్నట్లు ఆమె ప్రకటించారు. కాగా, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో సైనాతో ప్రచారం చేయించేందుకు బిజెపి రెడీ అవుతోంది. దేశవ్యాప్తంగా ఆమెకు ఉన్న స్టార్‌డమ్‌ను ఈ ఎన్నికల్లో వాడుకోవాలని ప్రణాళిక సిద్ధం చేస్తోంది. హైదరాబాదీ అయినా సైనా హరియాణాలో పుట్టింది. బ్యాడ్మింటన్ క్రీడను ఎంచుకొని ఎన్నో పతకాలు గెలిచి దేశానికి వన్నె తెచ్చింది. ప్రపంచ నంబర్ వన్‌గా నిలిచింది. మొత్తంగా 24 అంతర్జాతీయ అవార్డులు గెలిచింది.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/