రాష్ట్ర యంత్రాంగమంతా నర్సీపట్నంలోనే ఉంది : అయ్యన్నపాత్రుడు

వైస్సార్సీపీ నేతలు కక్షసాధిస్తున్నారన్న టీడీపీ

ayyanna patrudu
ayyanna patrudu

అమరావతి : నర్సీపట్నంలో ఇటీవల మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు ఇంటి ప్రహరీ గోడ కూల్చివేత వ్యవహారం తీవ్ర రాజకీయ దుమారం రేపడం తెలిసిందే. వైస్సార్సీపీనేతలు కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఈ వ్యవహారంపై అయ్యన్న ట్విట్టర్ లో స్పందించారు.

తనను ఎదుర్కోవడానికి రాష్ట్ర అధికార యంత్రాంగం అంతా నర్సీపట్నంలోనే ఉందని వెల్లడించారు. జేసీబీలు, ఐపీఎస్ లు, ఆర్డీవోలు, వందల సంఖ్యలో పోలీసు సిబ్బంది, పదుల సంఖ్యలో పోలీసు వాహనాలు తీసుకువచ్చారని ఆరోపించారు. సోషల్ మీడియా పోస్టులపై కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. అంత భయం ఎందుకు సాయిరెడ్డీ…? దమ్ముంటే నేరుగా నువ్వే నర్సీపట్నం వచ్చేయ్ తేల్చుకుందాం అంటూ అయ్యన్న వైస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి సవాల్ విసిరారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/international-news/