అయోధ్య రామాలయ ట్రస్ట్ లోగో విడుదల
విశేషంగా ఆకట్టుకుంటున్న లోగో
అయోధ్య: ప్రస్తుతం దేశంలో లాక్డౌన్ కొనసాగుతున్నప్పటికి అయోధ్యలోని రామమందిరం నిర్మాణ పనులు జరుగుతూనె ఉన్నాయి. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని రామాలయ ట్రస్ట్ తన అధికారిక లోగోను విడుదల చేసింది. ఈ లోగోపై సంస్కృతంలో రామో విగ్రహ్వాన్ ధర్మం అనే పదాలున్నాయి. అంటే రామ్ విగ్రహం మతం అని ఆలయ ధర్మకర్త డాక్టర్ అనిల్ మిశ్రా తెలిపారు. కాగా ఆలయ ట్రస్టు లోగో అందరిని ఆకట్టుకుంటుంది.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/