ప్రపంచ రికార్డు సృష్టించేందుకు సిద్ధమైన అయోధ్య

అయోధ్య: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య దీపావళి వేడుకలకు ముస్తాబైంది. దీపావళి సందర్భంగా అత్యధిక దీపాలు వెలిగించి ప్రపంచ రికార్డు నమోదు చేసేందుకు అయోధ్య నగరం సిద్ధమైంది. ప్రభుత్వం రికార్డు స్థాయిలో 12 లక్షల దీపాలను వెలిగించడానికి ఏర్పాట్లు చేసింది. సరయు నదీ తీరంలోని రామ్ కి పైడీ ఘాట్‌లో 9 లక్షల దీపాలు వెలిగించనుండగా.. మిగిలిన దీపాలు వివిధ పట్టణాలలో వెలగనున్నాయి.నేడు 12 లక్షల మట్టి దీపాలతో దేదీప్యమానంగా అయోధ్య నగరం, సరయూ నదీ తీరం…శోభిల్లనుంది. ఒకేసారి 12ల‌క్ష‌ల దీపాలు వెలగనున్నాయి.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/