కేవలం వారి కోసమే ఆస్ట్రియాలో లాక్ డౌన్

వ్యాక్సిన్ తీసుకోని వారికి లాక్ డౌన్ విధించిన ప్రభుత్వం
టీకా తీసుకోని వారు బయటకు వస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక

వియన్న : కరోనా మహమ్మారితో ప్రపంచ దేశాలన్నీ అల్లాడిపోయాయి. దీంతో అన్ని దేశాలు కఠినమైన ఆంక్షలు విధించి కరోనా వ్యాప్తిని నిలువరించే ప్రయత్నం చేశాయి. యుద్ధ ప్రాతిపదికన వ్యాక్సిన్లు వేశాయి. ఈ క్రమంలో అనేక దేశాల్లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. అయితే కొన్ని దేశాల్లో మాత్రం కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతోంది. యూరప్ లోని ఆస్ట్రియాలో కూడా కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆస్ట్రియా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

దేశ వ్యాప్తంగా 10 రోజుల పాటు లాక్ డౌన్ విధిస్తున్నట్టు ఆస్ట్రియా ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఈ లాక్ డౌన్ అందరికీ కాదు. కేవలం వ్యాక్సిన్ తీసుకోని వారికి మాత్రమే వర్తిస్తుందని ప్రభుత్వం తెలిపింది. వ్యాక్సిన్ తీసుకోని వారు బయటకు వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఆ దేశంలో ఇప్పటి వరకు కేవలం 65 శాతం మాత్రమే రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నారు.

తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/business/