టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న ఆస్ట్రేలియా

Australia won the toss
Australia won the toss

ముంబయి: భారత్‌-ఆస్ట్రేలియా మధ్య మూడు వన్డేల సిరీస్‌లో ఆస్ట్రేలియా టాస్‌ గెలిచి తొలుత ఫీల్డింగ్‌ను ఎంచుకుంది. ఇరు జట్ల మధ్య ముంబయిలోని వాఖండే స్టేడియంలో తొలి వన్డే జరుగుతున్న విషయం తెలిసిందే. డే నైట్ గా సాగనున్న ఈ మ్యాచ్ లో రాత్రి పూట మంచు కురిసే అవకాశముంది. రాత్రి బ్యాటింగ్ చేసే జట్టుకు కొంచెం కష్టమే అయినప్పటికీ.. అసీస్ బౌలింగ్ ఎంచుకొని సాహసం చేసిందనే చెప్పాలి. కాగా, రెండోసారి బ్యాటింగ్ సులువుగా ఉంటుందని భారత జట్టు కెప్టెన్ కోహ్లీ అనడం గమనార్హం. భారత జట్టు: విరాట్ కోహ్లీ(కెప్టెన్), రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, కెెఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్, మనీష్ పాండే, కేదార్ జాదవ్, రవీంద్ర జడేజా, శివం దూబె, మహ్మద్ షమీ, బుమ్రా, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, నవదీప్ సైనీ, యజువేంద్ర చాహల్. ఆస్ట్రేలియా జట్టు: డేవిడ్ వార్నర్ ఆరోన్ ఫించ్(కెప్టెన్) మార్నస్ లబుచాంజె, స్టీవెన్ స్మిత్, అస్టన్ టర్నర్, అలెక్స్ క్యారీ, ఆస్టన్ అగర్, పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, కానె రిచర్డ్ సన్, అడం జంపా

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/