టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్
బెంగళూరు: భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య ఈరోజు నిర్ణయాత్మక మ్యాచ్ జరుగుతుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో భారత్ఆస్ట్రేలియా మధ్య చివరి వన్డే మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది. ముంబయి వాంఖడే స్టేడియంలో 10 వికెట్ల తేడాతో భారత్ను ఆస్ట్రేలియా ఓడించింది. రాజ్కోట్లో జరిగిన రెండో వన్డేలో ఆస్ట్రేలియాపై 36 పరుగులతో టీమిండియా విజయం సాధించింది. దీంతో ఇరు జట్లు 11తో ఉన్నాయి. ఈ రోజు జరుగుతోన్న మ్యాచ్లో గెలిచిన వారికే కప్ దక్కుతుంది. టీమిండియాలో రోహిత్ శర్మ, ధావన్, కేఎల్ రాహుల్, కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, మనీశ్ పాండే, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, షమీ, సైనీ, బుమ్రా ఉన్నారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/