ఆస్ట్రేలియా 191 పరుగులకు ఆలౌట్
భారత్ తో నాలుగు టెస్టుల సిరీస్
భారత్ తో నాలుగు టెస్టుల సిరీస్ లో భాగంగా ఇక్కడ జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 191 పరుగులకు ఆలౌట్ అయ్యింది.
అంతకు ముందు భారత్ 244 పరుగులకు ఆలౌట్ అయిన సంగతి విదితమే. రెండో రోజు ఆట మరి కొద్ది సేపటిలో ముగుస్తుందనగా ఆస్ట్రేలియా ఆలౌట్ అయ్యింది.
హాజల్ వుడ్ ఉమేష్ యాదవ్ బౌలింగ్ లో పుజారాకు క్యాచ్ ఇచ్చి ఔటవ్వడంతో ఆసీస్ ఇన్నింగ్స్ ముగిసింది. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో భారత్ కంటే 53 పరుగులు వెనుకబడింది.
తాజా బిజినెస్ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/