వీల్ ఛైర్‌లో ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్

ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్ వీల్ ఛైర్‌లో ఉన్న పిక్ సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. ఈ పిక్ చూసిన వైస్సార్సీపీ కార్య కర్తలు , రాజకీయ నేతలు సురేష్ కు ఏమైందంటూ మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో తన ఆరోగ్యం క్లారిటీ ఇచ్చారు కుటుంబ సభ్యులు. హైదరాబాద్ సోమాజిగూడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో సురేష్ కు మోకాలికి సర్జరీ జరిగినట్లు తెలిపారు.

కొద్దీ రోజుల క్రితం ఆదిమూలపు సురేష్ అనారోగ్యానికి గురైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మోకాలి నొప్పి తీవ్రతరం కావడం తో వైద్యుల సూచన మేరకు ఆయన శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఆపరేషన్ విజయవంతంగా జరిగిందని వైద్యులు తెలిపారు. త్వరలోనే రాష్ట్ర ప్రజలతో పాటు ముఖ్యంగా తన యర్రగొండపాలెం నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటానని .తనపై అభిమానం చూపుతున్న రాష్ట్ర ప్రజలు యర్రగొండపాలెం నియోజకవర్గ ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.