వరంగల్ జిల్లా కలెక్టరేట్ వద్ద లో ఉద్రిక్తత..పత్తి మిల్లు యజమాని ఆత్మహత్య యత్నం
వరంగల్ జిల్లా కలెక్టరేట్ వద్ద కలెక్టర్ ఎదుట రఘురాం అనే పత్తి మిల్లు యజమాని పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్ననించడం కలకలం రేపింది. పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకునే యత్నం చేయగా స్థానికులు అడ్డుకున్నారు. పత్తి మిల్లు నడుపుకోడానికి లంచం డిమాండ్ చేస్తున్నారని ఆవేదన చెంది ఇలా ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నట్లు రఘురాం తెలిపారు. ఇదివరకు గ్రీవెన్స్ సెల్ లో ఫిర్యాదు చేసిన స్పందించలేదని .. దిక్కుతోచని స్థితిలోనే ఈ ఘాతుకానికి ఒడిగట్టానని వాపోయాడు. మరోసారి గ్రీవెన్ సెల్ కు వచ్చిన అధికారులు స్పందించకపోవడంతో.. ఆత్మహత్యకు యత్నించిన రఘురాం కన్నీరుమున్నీరు అయ్యాడు.
ఇదివరకు 45 వేలు లంచంగా ఇచ్చానని … బేల్ కు 50 వేల చొప్పున ఇవ్వాలని, కాటన్ సెక్షన్ అధ్యక్ష కార్యదర్శులు డిమాండ్ చేస్తున్నారని రఘురాం ఆరోపించాడు. డబ్బులు ఇవ్వకపోవడంతో తన మిల్లుకు పత్తి కేటాయించడం లేదని ఆందోళన వ్యక్తం చేశాడు. తను డబ్బులు ఇచ్చే పరిస్థితుల్లో లేనని అధికారులను వేడుకున్నా స్పందించలేదని కన్నీరు పెట్టుకున్నాడు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తన పత్తి మిల్లును నడుపుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరాడు.