అనంతపురం విషాద ఘటన : విద్యుత్ శాఖకు చెందిన ముగ్గురు ఉద్యోగులపై వేటు

అనంతపురం జిల్లా బొమ్మనహాల్ మండలం దర్గాహోన్నూరులో జరిగిన విద్యుత్ తీగలు తెగిపోయిన ఘటన ఫై ప్రభుత్వం సీరియస్ అయ్యింది. విద్యుత్ శాఖకు చెందిన ముగ్గురు ఉద్యోగులపై వేటు వేసింది. ఏడీ, ఏఈ, లైన్ ఇన్ స్పెక్టర్ ను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. బుధువారం వ్యవసాయ పనుల నిమిత్తం ట్రాక్టర్‌ ఫై వెళ్తున్న కూలీలఫై విద్యుత్ తీగలు తెగిపడటంతో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరి పరిస్థితి విషయంగా ఉంది.

దర్గాహోన్నూరు గ్రామానికి చెందిన కూలీలు పొలంలో మొక్కజొన్న కంకుల కోతకు వెళుతుండగా విద్యుత్ మెయిన్ వైర్లు ఒక్కసారిగా తెగిపడ్డాయి. దీంతో నలుగురు మహిళా కూలీలు అక్కడికక్కడే సజీవ దహనం అయ్యారు. ఈ ఘటనపై ప్రభుత్వం స్పందించింది. విద్యుత్ శాఖకు చెందిన ముగ్గురు ఉద్యోగులపై వేటు వేసింది. ఏడీ, ఏఈ, లైన్ ఇన్ స్పెక్టర్ ను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు అధికారులు ప్రకటించారు. అలాగే బాధిత కుటుంబాలకు పరిహారం చెల్లించేలా తగిన చర్యలు తీసుకోవాలని డిస్కంను ఆదేశించింది ప్రభుత్వం.

ఈ ఘటన ఫై దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన సీఎం జగన్..మృతి చెందిన కుటుంబాలకు 10 లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. బాధిత కుటుంబాలకు అండగా ఉండాలని అధికారులను, స్థానిక నేతలను ఆదేశించారు. ఈ ప్రమాదంలో గాయపడిన మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండగా.. వారికి మెరుగైన చికిత్స అందేలా చూడాలని సూచించారు.

ఈ ఘటనపై ఎమ్మెల్యే కాపు రామచంద్రా రెడ్డి విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందేలా అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు వెల్లడించారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించడంతోపాటు.. మృతుల కుటుంబాలను అన్ని విధాల ఆదుకుంటామని.. వారు ధైర్యంగా ఉండాలని వ్యాఖ్యానించారు.