అమెజాన్ .. పడవ ప్రమాదం..18 మంది మృతి
46 మందిని రక్షించిన అధికారులు
బ్రెజిల్: బ్రెజిల్లోని అమెజాన్ అటవీ ప్రాంతంలో ప్రయాణిస్తున్న ఓ పడవ ప్రమాదవశాత్తు మునిగిపోవడంతో అందులో ప్రయాణిస్తున్న వారిలో18 మంది జల సమాధి అయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే రంగంలోకి దిగిన అధికారులు 46 మందిని రక్షించారు. ప్రయాణికుల్లో 30 మంది గల్లంతయ్యారు. వారి జాడ కనుగొనేందుకు బ్రెజిల్ నావికాదళం హెలికాప్టర్లు, విమానాలు, గజ ఈతగాళ్లను రంగంలోకి దింపారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు అందాల్సి ఉంది.
తాజా కెరీర్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/specials/career/