ప్రివిలేజ్ కమిటీ ముందుకు అచ్చెన్నాయుడు

ఏపీ అసెంబ్లీ స్పీకర్‌ తమ్మినేనిపై అనుచిత వ్యాఖ్య‌లు చేశార‌ని ఆరోప‌ణ‌

అమరావతి : ఏపీ అసెంబ్లీ స్పీకర్‌ తమ్మినేనిపై టీడీపీ నేత‌ అచ్చెన్నాయుడు అనుచిత వ్యాఖ్యలు చేశార‌న్న ఆరోప‌ణ‌ల‌పై ఈ రోజు ప్రివిలేజ్ కమిటీ విచార‌ణ జ‌రిపింది. ఆ క‌మిటీ ఛైర్మన్‌ కాకాణి గోవర్ధ‌న్ రెడ్డి అధ్యక్షతన జ‌రిగిన భేటీకి అచ్చెన్నాయుడు హాజ‌ర‌య్యారు.

ఇటీవ‌లే అచ్చెన్నాయుడికి నోటీసులు అంద‌డంతో ఆయ‌న ఈ విచార‌ణ‌లో పాల్గొన్నారు. కాగా, మరికొంతమంది టీడీపీ నేతలకు కూడా ప్రివిలేజ్ కమిటీ నోటీసులు ఇచ్చింది. వారిని కూడా విచారించే అవ‌కాశం ఉంది. గత నెలలో జరిగిన ప్రివిలేజ్ కమిటీ సమావేశానికి అచ్చెన్నాయుడు హాజ‌రుకాలేదు. దీంతో కమిటీ ఈ రోజు మ‌రోసారి స‌మావేశం కావ‌డంతో ఆయ‌న హాజ‌రయ్యారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/national/