ఏపి ఎన్నికల కమిషనర్కు అచ్చెన్నాయుడు లేఖ
ప్రతిపక్ష నాయకులపై వైఎస్ఆర్సిపి నేతలు దాడులకు పాల్పడుతున్నారు..అచ్చెన్నాయుడు
అమరావతి: టిడిపి ఏపి అధ్యక్షుడు అచ్చెన్నాయుడు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్కు లేఖ రాశారు. ప్రతిపక్ష నాయకులపై వైఎస్ఆర్సిపి నేతలు దాడులకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. సంతమాగులూరు మండలంలో వైఎస్ఆర్సిపి శ్రేణులు దాడులకు పాల్పడ్డారని ఆయన చెప్పారు. ఏపిలో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి దిగిన టిడిపి అభ్యర్థులపై ఈ దాడులు జరుగుతున్నాయని అచ్చెన్నాయుడు తెలిపారు. దాడులు, దౌర్జన్యాలకు పాల్పడిన ప్రాంతాల్లో ఎన్నికలు వాయిదా వేయాలని ఆయన కోరారు.
ప్రతిపక్ష అభ్యర్థులకు కేంద్ర భద్రతా దళాలతో రక్షణ కల్పించాలని, ఆన్లైన్లో నామినేషన్ ప్రక్రియ చేపట్టేందుకు ఏర్పాట్లు చేయాలని ఆయన చెప్పారు. అలాగే, దాడుల నుంచి రక్షణ కోసం కేంద్ర భద్రతా దళాల సహకారంతో ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని అచ్చెన్నాయుడు కోరారు. ఏపి వ్యాప్తంగా వైఎస్ఆర్సిపి శ్రేణులు అప్రజాస్వామిక విధానాలకు పాల్పడుతున్నారని ఆయన లేఖలో పేర్కొన్నారు. హత్యారాజకీయాలతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, వైఎస్ఆర్సిపి నేతలు సృష్టించిన వీరంగంపై సీబీఐ విచారణ జరగాలని కోరారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/