ఘోర రోడ్డు ప్రమాదం.. 53 మంది మృతి

చియాపాస్‌: మెక్సికోలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మెక్సికోలోని దక్షిణాది రాష్ట్రమైన చియాపాస్‌లో వలసదారులతో వెళ్తున్న ట్రక్కు రిటైనింగ్‌ గోడను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 53 మంది వలసదారులు మృతిచెందారు. మరో 54 మంది గాయపడ్డారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. వారంతా వలసకార్మికులని, సరైన ధృవపత్రాలు లేకుండా అక్రమంగా అమెరికాకు వెళ్తున్నారని స్థానిక ప్రాసిక్యూటర్ కార్యాలయం ప్రకటించింది. వారు ప్రయాణిస్తున్న ట్రక్కు అదుపుతప్పి చియాపాస్‌లో రిటైనింగ్ గోడను ఢీకొని బోల్తా పడిందని చెప్పారు. వారంతా ఏదేశానికి చెందినవారనే విషయం ఇంకా తెలియరాలేదన్నారు. మృతుల కుటుంబాలకు రాష్ట్ర గవర్నర్ రుటిలియో ఎస్కాండన్ సంతాపం తెలిపారు. ఈ ప్రమాదానికి కారణం ఎవరనే విషయంపై దర్యాప్తు చేస్తున్నామన్నారు.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/movies/