భారీ అగ్ని ప్ర‌మాదం.. 27 మంది మృతి

టోక్యో: జ‌పాన్‌లోని ఒసాకా న‌గ‌రంలో భారీ అగ్నిప్ర‌మాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 27 మంది మృతిచెందారు. న‌గ‌రంలో ఉన్న బిజీ షాపింగ్ బిల్డింగ్‌లో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. పోలీసులు ఈ ఘ‌ట‌న‌పై విచార‌ణ చేప‌ట్టారు. అగ్నిప్ర‌మాదం జ‌రిగిన 30 నిమిషాల్లోనే మంట‌ల్ని ఆర్పేశారు. డ‌జ‌న్ల సంఖ్య‌లో ఫైర్‌ఫైట‌ర్లు ప్ర‌మాదం జ‌రిగిన ప్ర‌దేశంలో ఉన్నాయి. 8 అంత‌స్తుల బిల్డింగ్‌లో ఉన్న నాలుగవ ఫ్లోర్ పూర్తిగా ధ్వంస‌మైంది. కిటికీలు న‌ల్ల‌బడ్డాయి. ఉద‌యం 10.18 నిమిషాల‌కు అగ్ని ప్ర‌మాదం జ‌రిగింది. మంట‌ల్ని ఆర్పేందుకు సుమారు 70 ఫైరింజ‌న్లు అక్క‌డ‌కు వ‌చ్చాయి.

తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/business/