జనంపై బుల్లెట్ల వర్షం..15 మంది మృతి

ఓ నిందితుడిని అదుపులోకి తీసుకున్న భద్రతా దళాలు

మెక్సికో: మెక్సికోలో దుండగులు చెలరేగిపోయారు. కార్లలో తిరుగుతూ మారణహోమం సృష్టించారు. విచక్షణ రహితంగా జరిపిన కాల్పుల్లో 15 మంది మరణించారు. అమెరికా-మెక్సికో సరిహద్దు రాష్ట్రమైన రేనోసోలో జరిగిందీ ఘటన. కొందరు దుండగులు కార్లలో తిరుగుతూ జనంపై తూటాల వర్షం కురిపించారు. ఈ ఘటనలో 15 మంది ప్రాణాలు కోల్పోగా పలువురు గాయపడ్డారు.

వెంటనే అప్రమత్తమైన భద్రతా బలగాలు ఎక్కడికక్కడ తనిఖీలు చేపట్టి ఓ నిందితుడిని అదుపులోకి తీసుకున్నాయి. అతడి కారు డిక్కీలో బంధించిన ఇద్దరు మహిళలను రక్షించాయి. ఆ ఇద్దరినీ కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్నట్టు అధికారులు అనుమానిస్తున్నారు. మాఫియా ప్రాబల్యం ఎక్కువగా ఉన్న ఇక్కడ గల్ఫ్ కార్టెల్ ముఠాలో ఇటీవల విభేదాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో వరుసదాడులు జరుగుతున్నాయి.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/