రేపటి నుంచి అసోం లాక్ డౌన్
ప్రభుత్వం నిర్ణయం
Assam: అసోం వ్యాప్తంగా రేపటి నుంచి 14 రోజుల పాటు లాక్ డౌన్ విధిస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కరోనా కేసులు పెరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకుంది.
రాష్ట్రంలో కరోనా కట్టడికి లాక్ డౌన్ ఒక్కటే మార్గమని అసోం ప్రభుత్వం పేర్కొంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 7165 కరోనా కేసులు నమోదయ్యాయి.
అందులో4815 మంది డిశ్చార్జి కాగా 2093 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు 10 మంది మృతి చెందినట్లు తెలిసింది.
తాజా కెరీర్ సమాచారం కోసం : https://www.vaartha.com/specials/career/