కరోనా లక్షణాలతో ఏఎస్ఐ మృతి

కుటుంబ సభ్యులు వెల్లడి

corona death
corona death

నిర్మల్‌ జిల్లాలోని ఖానాపూర్‌ పోలీస్‌ స్టేషన్లో ఏఎస్‌ఐ జన్నారపు నారాయణ సోమవారం ఉదయం కరోనా లక్షణాలతో మృతి చెందారు.

ఆయన వయసు 56 సంవత్సరాలు. ఆయనకు భార్య, ఇద్దరు కూతుళ్లు, కొడుకు ఉన్నారు. రెండు రోజులుగా ఆయన శ్వాస తీసుకోవడంలో   ఇబ్బంది పడుతున్నారు.

పరిస్థితి తీవ్రం కావడంతో అర్థరాత్రి ఖానాపూర్‌ ఆస్పత్రికి చికిత్స కోసం వచ్చారు.

ఆయనను స్థానిక డాక్టర్లు నిర్మల్‌కు రెఫర్‌ చేశారు. నిర్మల్‌లోని ఓ పైవేటు దవాఖానాకు చికిత్సకోసం వెళ్లగా నారాయణ పరిస్థితి అప్పటికే పూర్తిగా విషమించింది.

మెరుగైన చికిత్స కోసం అంబులెన్స్‌లో హైదరాబాద్‌ తరలిస్తుండగా మార్గమధ్యంలో డిచ్‌పల్లి వద్ద మరణించారు.

ఆయన మృతదేహానికి స్నేహితులు మున్సిపాలిటీ సిబ్బంది పీపీఈ కిట్లు ధరించి జేసీబీ సహాయంతో ఖానాపూర్‌ శివారులో ఖననం చేశారు.

కరోనా ప్రభావంతోనే నారాయణ చనిపోయినట్లు ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/international-news/