ఆశిష్ గాంధీ, చిత్రశుక్ల కాంబినేషన్
సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ
‘నాటకం’ ఫేం ఆశీష్ గాంధీ, ‘రంగులరాట్నం’ ఫేమ్ చిత్ర శుక్ల కాంబినేషన్లో ఓ చిత్రం రూపొందనుంది.. రాజ్కుమార్ బాబీ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
బాబీ ఏడిద క్రియేటివ్ వర్క్స్ సమర్పణలో ఎవర్గ్రీన్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై బాబీ ఏడిద, రాజేష్ బొబ్బూరి ఈచిత్రాన్ని నిర్మించనున్నారు. ఈసంద్భంగా నిర్మాతలు మాట్లాడారు.. ఇదొక సస్పెన్స్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీ అన్నారు.
సినిమా ప్రారంభ సన్నివేశం నుంచి చివరి సన్నివేశం వరకు చాలా ఉత్కంఠ రేకెత్తిస్తుందని అన్నారు. కథలోని మలుపులు ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్నాయన్నారు.
ఆశీష్గాంధీ ఈచిత్రంలో హీరోగా నటించనున్నారు.. వివరాలు త్వరలో తెలియజేస్తామని, డిసెంబర్ మొదటి వారం నుంచి రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ ప్రారంభమవుతుందని తెలిపారు.
తాజా ఎన్నారై వార్తల కోసం : https://www.vaartha.com/news/nri/