ఆప్‌ ఘోర పరాజయం పాలవుతుంది

అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌కు గడ్డు పరిస్థితి

manoj tiwari
manoj tiwari

న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం హోరెత్తుతుంది. ఆప్, బిజెపి నేతలు కత్తులు దూసుకుంటున్నారు. మరో అడుగు ముందుకేసిన ఢిల్లీ బిజెపి చీఫ్ మనోజ్ తివారీ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఘోర పరాజయం పాలవుతోందని చెప్పారు. దీంతోపాటు అరవింద్ కేజ్రీవాల్ కూడా ఓడిపోతాడని, సీటు మారితే గెలిచేవాడేమోనని సంచలన ఆరోపణలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో అధికార ఆప్ గడ్డు పరిస్థితిని ఎదుర్కొబోతుందని మనోజ్ తివారీ పేర్కొన్నారు. ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా ఓడిపోతాడని వ్యాఖ్యానించారు. న్యూ ఢిల్లీ నుంచి కాక మరో చోట నుంచి పోటీ చేసే ఉంటే గెలిచేవాడేమోనని పేర్కొన్నారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/