మెలానియా ట్రంప్ కార్యక్రమానికి ఢిల్లీ సిఎం దూరం!
ఆహ్వానితుల జాబితా నుంచి ఢిల్లీ సీఎం, డిప్యూటీ సీఎం పేర్లు మాయం
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భార్య అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ భారత పర్యటన నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలకు వచ్చి అక్కడ జరిగే ‘హ్యాపీనెస్ క్లాస్’ను చూడనున్నారు. అలాగే, ఓ గంట పాటు పాఠశాల చిన్నారులతో అమెరికా ప్రథమ మహిళ మాట్లాడనున్నారు. అయితే ఈ కార్యక్రమానికి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాలను కేంద్ర దూరం పెట్టిందని ఆమ్ ఆద్మీ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాగా ముందస్తు ప్రణాళిక ప్రకారం మెలానియాకు ఢిల్లీ సీఎం, డిప్యూటీ సీఎం ఆహ్వానం పలకాల్సి ఉంది. అయితే, ఈ వీవీఐపీ ఈవెంట్ ఆహ్వానితుల జాబితా నుంచి కేజ్రీవాల్ , మనీశ్ పేర్లను కేంద్ర ప్రభుత్వం కావాలనే తొలగించిందని ఆప్ వర్గాలు ఆరోపిస్తున్నాయి.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/