అమిత్ షా సానుకూలంగా స్పందించారు
న్యూఢిల్లీ: ఈశాన్య ఢిల్లీలో అల్లర్లు చెలరేగిన నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం కేంద్ర హోమంత్రి అమిత్ షాతో బేటీ అయ్యారు. నిరసనలు తలెత్తిన ప్రాంతంలో చర్యలు తీసుకోవడంపై అమిత్ షా సానుకూలంగా స్పందించినట్లు కేజ్రీవాల్ పేర్కొన్నారు. నిరసన జరిగిన ప్రాంతానికి పోలీసులను పంపనున్నట్లు అమిత్ షా హామీ ఇచ్చారని కేజ్రీవాల్ వెల్లడించారు. దీంతో ఈశాన్య ఢిల్లీలో శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకు అన్ని పార్టీలు తమ సంసిద్ధతను వ్యక్తం చేశాయని కేజ్రీవాల్ తెలిపారు.
తాజా క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/sports/