మహారాష్ట్రలో ‘దిశ’ చట్టాన్నికి ఏర్పాట్లు

చట్టంపై అధ్యయనం చేసేందుకు ఐదుగురు సభ్యుల కమిటీ ఏర్పాటు

LAW
LAW

మహారాష్ట్ర: ఏపి ప్రభుత్వం అత్యాచార కేసుల్లో నిందితులకు మరణ శిక్ష పడేలా చేయడంతో పాటు 21 రోజుల్లోనే తీర్పు వెలువడేలా ‘దిశ’ చట్టాన్ని రూపొందించిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో మహారాష్ట్రలోనూ ‘దిశ’ చట్టాన్ని తెచ్చే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ చట్టంపై అధ్యయనం చేసేందుకు మహారాష్ట్ర సర్కారు ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. మార్చి 30వ తేదీలోపు నివేదిక అందజేయాలని ఈ కమిటీని ఆదేశించినట్టు ఆ రాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్ ముఖ్ తెలిపారు. దిశ చట్టం గురించి తెలుసుకునేందుకు తాము ఏపీలో పర్యటించామని చెప్పారు. ఈ చట్టంపై ఢిల్లీ, ఒడిశా ప్రభుత్వాలు కూడా ఇంతకుముందు ఆసక్తి వ్యక్తం చేశాయి. ఏపీ సర్కారు నుంచి పూర్తి వివరాలు కోరాయి.

తాజా వీడియోస్‌ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/videos/