ఏపీ ప్రజలకు ఆర్టీసి గుడ్ న్యూస్…!

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఆర్టీసి గుడ్ న్యూస్ చెప్పింది. ఏపిఎస్ ఆర్టీసి ఎండీ కృష్ణ బాబు మీడియాతో మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సుల రాకపోకల విషయంలో ఒకట్రోండు రోజుల్లో క్లారిటీ రావచ్చు అని అన్నారు. తెలంగాణ కోరిన విధంగానే 1.05 లక్షల కిలో మీటర్లు తగ్గించుకున్నాం అని చెప్పారు. వాళ్లు ప్రతిపాదించిన రూట్లల్లో కూడా ఏపీ బస్సులను తక్కువగా తిప్పేందుకు అంగీకరించాం అన్నారు.

APSRTC Busses
APSRTC Busses

తెలంగాణ పెట్టిన షరతుల వల్ల విజయవాడ-హైదరాబాద్ రూట్లో సుమారు 350 బస్సులు తిరిగే అవకాశం ఉండదని అన్నారు. ఏపీఎస్సార్టీసీకి నష్టం చేకూర్చేలా ఉన్నా.. ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ ప్రతిపాదనలకు అంగీకరించాం ని పేర్కొన్నారు. ఏడాదికి సుమారు రూ. 265 కోట్ల మేర రెవెన్యూ లాస్ వస్తుందని ఆయన వివరించారు. తెలంగాణ ప్రతిపాదనలకు అంగీకరించాం కాబట్టి తెలంగాణ నుంచి త్వరలోనే గ్రీన్ సిగ్నల్ వస్తుందని భావిస్తున్నామని అన్నారు. ప్రైవేట్ బస్ ఆపరేటర్లు ఎక్కువ ఛార్జీలు వసూలు చేయకుండా నిఘా పెట్టామని అన్నారు.