త్వరలోనే వీసీల నియామకం
మంత్రి సబితా ఇంద్రారెడ్డి
Hyderabad: రాష్ట్రంలోని యూనివర్సిటీలకు త్వరలోనే వీసీలను నియమిస్తామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు.
యూనివర్సిటీల్లో వీసీల నియామకం, ఉద్యోగాల భర్తీ పక్రియపై శాసనమండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సబిత సమాధానం ఇచ్చారు.
అన్ని యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న 1061 పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది అని మంత్రి పేర్కొన్నారు. వీటిని భర్తీ చేస్తున్న సమయంలో ఏకరూప నిబంధన రూపొందించాలని మార్గదర్శకాలు రావడంతో ప్రభుత్వం ఓ కమిటీని నియమించింది.
ఈ క్రమంలోనే రోస్టర్ను రూపొందించాలని యూజీసీ కూడా ఉత్తర్వులిచ్చిందని మంత్రి గుర్తు చేశారు. ఆ తర్వాత కోర్టులో కేసు ఉన్నందున తమ ఉత్తర్వును ఆపేయాలని యూజీసీ ప్రకటించింది.
సుప్రీంకోర్టు తీర్పు ఆధారంగా యూనివర్సిటీల్లో ఉద్యోగాల భర్తీ చేపట్టాలని ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. యూజీసీ సూచనల మేరకు యూనివర్సిటీల్లో ఉద్యోగాలు చేపట్టేందుకు మార్గదర్శకాలు రూపొందించేందుకు ఉన్నత విద్యాశాఖ ఆధ్వర్యంలో 2020, జనవరి 9న ఒక కమిటీని నియమించామని మంత్రి తెలిపారు.
కమిటీ నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. వీలైనంత త్వరగా ఉద్యోగ నియామకాలు చేపడుతుమన్నారు.
ఇక వీసీల నియామకం కూడా త్వరలోనే చేపడుతాం. సెర్చ్ కమిటీలతో సమావేశమై వీసీలను ఎంపిక చేస్తామని మంత్రి స్పష్టం చేశారు.
తాజా ‘నిఘా’ వార్తల కోసం : https://www.vaartha.com/specials/investigation/