క్షమాపణను వృద్ధి చేసుకోవాలి

ఆధ్యాత్మిక చింతన

Lord Buddha
Lord Buddha

”నిందాస్తుతులు నిజజీవితానికి నిత్యాభర ణాలు. నింద తెలియని బ్రతుకులో అందం లేదు. కీర్తి గల వానికి స్తుతులు చుట్టాలే.

నిజస్తుతి వాస్తవానికి వీను లకు విందే. కాని అసత్యపు పొగడ్తలు విందులుగా గోచరించినా అవి విషాలే.వంచనకు అలవాటు పడిన వారు ఇతరులలో మంచిని చూడలేరు.

మంచి చెడులు మనిషి మనస్సుకు తేలికగా దొరకవు.

మంచివారిలో కొంత చెడు లేకపోలేదు. చెడ్డవారిలో కొంత మంచి ఉండకపోదు.నీలో మంచిని అందరూ చూడలేరు. మంచివాడే మంచిని చూడగలడు.

కొందరు మంచిని గ్రహించలేక పోయినా చెడును మాత్రం గ్రహించరు. మరికొందరు చెడును గ్రహిం చడమే జీవితధ్యేయంగా పెట్టుకొని ఉంటారు.

చెడ్డవారు చెడినవారే గనుక చెడుమాటలు, చెడు చేష్టలకే పరిమితులు. వారికి పెద్ద, చిన్న తారతమ్యము తెలియదు.

పరులను బాధించడములో వారికి పరమాన్నం లభించినట్లు ఉంటుంది. సాధకులు నిందలను చూసి కృంగి పోకూడదు.

వందనీయులను కూడా నిందలు వదలవు. గొర్రెల మందకు గౌరవమేమిటో తెలియదు. నీవు పెరుగుతున్నావంటే నీతో పాటు, నీ చుట్టూ పెరుగుతూ ఉంటాయి. అది సహజం.

వాటి మధ్య నీవు చెదిరిపోతేనే అసహజం. నిందలను సవాళ్లుగా స్వీకరించాలి. నిన్ను పెంచేందుకే నిందలు నిలిచి వున్నాయి.

తన శిష్యుల సహాయంతో బుద్ధుడు ఒక స్త్రీని హత్యచేసిన ట్లు వదంతులు వ్యాప్తిచేశారు కొందరు నీచులు.

చాలామంది వ్యతిరేకులు బుద్ధుని విమర్శించారు. శిష్యుడైన ఆనందుడు బుద్ధుని సమీపించి ”మనం ఈ ఊరు వదలి మరొక ఊరికి వెళ్దాము అన్నాడు.

‘మరి ఆ ఊరిలో కూడా నిందిస్తే ఏం చేద్దాం? అన్నాడు గౌతమబుద్ధుడు.

”ఇంకొక ఊరికి వెళ్దాం అన్నాడు ఆనందుడు.”ఆనందా! అయితే మనంఉండేందుకు ఈ దేశంలో స్థలం దొరకదు. ఓర్పుతో జీవించు.

ఈ నిందలు కాలంలో కరిగిపో తాయి అంటాడు బుద్ధుడు. ఈ ప్రపంచం లో దోషము లేనివారు ఉండరు.

మన దోషాలు మనకు గోచరించవు. అందుచేత అవి ఆంతర్యంలో పటిష్టం గా స్థిరపడి ఉంటాయి. ఇతరులు మనల్ని దూషించినపుడు మనలోని దోషాలేవో మనకు తెలిసి వస్తాయి.

వెంటనే కాలికి అంటిన బురదను కడిగినట్లు దోషాలను నివృత్తి చేసుకోవచ్చు.

ఒకవేళ నిర్దోషులైన మనల్ని ఇతరులు దూషిస్తే ఎలా? అనే శంక నీకు రావచ్చు.

అప్పుడూ మంచిదే. లేని దోషాలను ఇతరులు మనకు చూపడం వల్ల మున్ముందు అవి రాకుండా మనం జాగ్రత్తపడే అవకాశం వారు కల్పించారు.

కనుక వారు అభినందనీ యులే. క్షమను వృద్ధి చేసేందుకు క్షామం వస్తుంది.

ఆపదలు అభివృద్ధికి పునాదు లు. బాధలే బ్రతుకును తీర్చిదిద్దే బోధలు.

ఈనాటి వెతలే ఓనాటి వెలుగుల తోరణాలు. ప్రతికూల పరిస్థితులను కూడా అవగాహనతో అను కూలంగా మార్చుకొను వారే ధన్యజీవులు.

తాత్త్వికుడైన ఒక మహాశయు ని భార్య గయ్యాళి. భర్తను తిట్టడము ఆమె నిత్యకృత్యాలలో ముఖ్యకార్యము.

ఒకరోజు ఆమెకు ఆరోగ్యం బాగలేక భర్తను తిట్టడమనే కార్యక్రమాన్ని సాగించలేక పోయింది.

స్నేహితుల మధ్య ఉన్న ఆ మహాశయుడు విషాదముగా గోచరి స్తున్నందుకు కారణమేమిటని స్నేహితులు ప్రశ్నించారు.

అనారోగ్యం కారణంగా తనను భార్య తిట్టలేదని, తన బాధకు కారణమది యేనని అతడు చెబుతాడు.

‘దానిని సంతోషించక బాధపడతావెందుకు?అన్నారు స్నేహితులు.”ఆమె తిడుతూ ఉంటే నేను సహనాన్ని వృద్ధి చేసుకొనే అవకాశం కలుగుతూ ఉండేది.

ఈరోజు నాకు ఆ భాగ్యం కలుగ లేదు. అందుకే దుఃఖిస్తున్నాను అంటాడు తాత్త్వి కుడు.

ఇవే బతుకులో ప్రతిబింబించదగిన నిత్యసత్యాలు. బాహ్మ పరిస్థితులు ప్రతికూల మైనా వాటిని ఆతంర్యంలో అనుకూలంగా మలచుకోగలిగిన వారే బ్రతుకు విలువ తెలిసినవారు.

వారే ప్రపంచంలో బలవంతులు. మన అభివృద్ధికి ప్రతికూలాలు అవసరమని నా అభిప్రాయం కాదు. ప్రతి కూలాలను అవరోధాలుగా భావించక అనుకూలాలుగా మార్చుకోవాలి అనేదే అభిమంతం.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/