అపెక్స్ కౌన్సిల్ సమావేశం ప్రారంభం
హైదరాబాద్: ఏపి, తెలంగాణల మధ్య జలవివాదాలపై చర్చించేందుకు అపెక్స్ కౌన్సిల్ సమావేశం ప్రారంభమైంది. కేంద్రమంత్రి షెకావత్ అధ్యక్షతన కొనసాగుతున్న ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాల సిఎంలు పాల్గొన్నారు. ఏపి సిఎం జగన్ ఢిల్లీ నుంచి, తెలంగాణ సిఎం కెసిఆర్ హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశంలో పాల్గొన్నారు. కృష్ణా జిలాల వివాదంపై రెండు రాష్టాలు గట్టిగా వాదనలు వినిపించేందకు సిద్ధమయ్యాయి. మరోవైపు కేంద్రం కూడా ఈ భేటిలో కొన్ని నిర్ణయాలు తీసుకోవాలనే ఆలోచనతో ఉన్నట్లు సమాచారం. నాలుగు అంశాలను ఎజెండాగా నిర్ణయించినప్పటికీ, వీటికి అనుబంధంగా అనేక అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఈ సమావేశంలో సిఎం జగన్ వెంట మంత్రి అనిల్కుమార్, కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఉన్నారు.
తాజా అంతర్జాతీయ వార్తల కసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/international-news/