అసెంబ్లీలో 3 రాజధానుల ఉపసంహరణ బిల్లు
సియం జగన్ ప్రకటనపై సర్వత్రా ఆసక్తి
Amaravati: అసెంబ్లీలో ఇవాళ మూడు రాజధానుల ఉపసంహరణ బిల్లును మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రవేశపెట్టారు. అంతేకాకుండా . సీఆర్డీఏ రద్దు ఉపసంహరణ బిల్లును కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ప్రస్తుతం అసెంబ్లీలో కీలక చర్చ జరుగుతోంది. ఈ బిల్లులపై చర్చకు స్పీకర్ తమ్మినేని సీతారామ్ అనుమతించారు. బుగ్గన మాట్లాడిన తర్వాత సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీ వేదికగా కీలక ప్రకటన చేయనున్నారు.
తెలంగాణ వార్తల కోసం: https://www.vaartha.com/telangana/