ఏపీకి చెందిన యువతీ ఫై నైజీరియన్ల అత్యాచారం

ఆంధ్రప్రదేశ్ కు చెందిన యువతీ..బెంగుళూరు లో ఓ కంపెనీలో హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తోంది. ఈ క్రమంలో ఆమెకు సోషల్ మీడియా లో టోనీ అనే నైజీరియన్ వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ తరచూ ఫోన్‌లో మాట్లాడుకుంటూ ఉండేవారు. రీసెంట్ గా ఇద్దరు కలుసుకోవాలని నిర్ణయించుకున్నారు.ఇదే క్రమంలో మంగళవారం(ఆగస్టు 31) ఆ యువతి కమ్మరహళ్లిలోని టోనీ ఇంటికి వెళ్లింది. అక్కడ ఇద్దరు కలిసి ఫుల్ గా మద్యం సేవించి..మద్యం మత్తులో శృంగారంలో పాల్గొన్నారు. ఉదయం లేచి చూసేసరికి ఆమె పక్కన మరో యువకుడు ఉబాకా నగ్నంగా ఉండడం చూసి షాక్ అయ్యింది. మద్యం మత్తులో అతడితో కూడా శృంగారంలో పాల్గొన్నాన అనే అనుమానం ఆమెకు కలిగింది.

గతంలోనూ అతను తనకోసారి మెసేజ్‌ చేసినట్లు గుర్తు తెచ్చుకుంది. తనను కలిసేందుకు అతను ప్రయత్నించగా ఆమె అతన్ని దూరం పెట్టింది. ఉబాకా గురించి టోనీని ఆమె ప్రశ్నించగా.. అతనెవరో తనకు తెలియదని బుకాయించాడు. దీంతో బాన్సవాడి పోలీసులను ఆశ్రయించిన యువతి తనపై ఇద్దరు నైజీరియన్లు అత్యాచారానికి పాల్పడ్డారని ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.