ఏపీలో వాహనదారులకు షాక్ ఇచ్చిన సర్కార్

Govt of AP
Govt of AP

ఏపీలో వాహనదారులకు షాక్ ఇచ్చింది ఏపీ సర్కార్. మామూలుగా కొత్త వాహనం కొనుగోలు చేస్తే దానికి ఫ్యాన్సీ నెంబర్‌ ఉండాలని కొందరు భావిస్తుంటారు. ఎందుకంటే ఆ నెం వారి లెవల్‌ను పెంచుతుందని కొంతమంది భావిస్తే..మరికొంతమంది సెంటిమెంట్ గా భావిస్తుంటారు. అయితే ఆలా భావించే వాహనదారులకు తాజాగా ఏపీ సర్కార్ షాక్ ఇచ్చింది. వాహ‌నాల ఫ్యాన్సీ నెంబ‌ర్ల ప్రాథ‌మిక రుసుమును భారీగా పెంచుతూ ఏపీ ర‌వాణా శాఖ నిర్ణ‌యించింది.

ప్ర‌స్తుతం వాహ‌నాల ఫ్యాన్సీ నెంబ‌ర్ల కోసం ద‌ర‌ఖాస్తు చేసుకునే వారు రూ.5 వేలు చెల్లించి వేలంలో పాల్గొన‌వ‌చ్చు. అయితే తాజాగా ఈ రుసుమును రూ.2 ల‌క్ష‌ల‌కు పెంచుతూ ఏపీ ర‌వాణా శాఖ నిర్ణ‌యం తీసుకుంది. ఈ మేర‌కు మోటారు వాహ‌నాల చ‌ట్టానికి స‌వ‌ర‌ణ‌ను చేస్తూ ఏపీ ర‌వాణా శాఖ గురువారం నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ర‌వాణా శాఖ తీసుకున్న ఈ నిర్ణ‌యంతో ఫ్యాన్సీ నెంబ‌ర్లు కావాల‌నుకునే వారు రూ.5 వేల‌కు బ‌దులుగా రూ.2 ల‌క్ష‌ల‌ను ప్రాథ‌మిక రుసుముగా చెల్లించాల్సి ఉంటుంది.