రేపు ఏపి టిడిపి పొలిట్బ్యూరో సమావేశం.
ఉదయం 11:30 గంటలకు సమావేశం
అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు రేపు ఏపి టిడిపి పొలిట్బ్యూరో సమావేశం నిర్వహించనున్నారు. రేపు ఉదయం 11:30 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా కేసులు, చేపట్టాల్సిన చర్యలు, నిత్యావసరాల ధరల పెరుగుదల, పంట గిట్టుబాటు ధరలు, కూలీల ఇబ్బందులపై రేపు టిడిపి పొలిట్బ్యూరో సమావేశంలో చర్చించనున్నట్లు తెలిసింది.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/