ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల
మంత్రి సురేష్ వెల్లడి
Amaravati: ఇంటర్మీడియట్ ప్రధమ, ద్వితీయ పరీక్షా ఫలితాలనుమంత్రి ఆదిమూలపు సురేష్ విజయవాడలో విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కరోనా కష్టకాలంలోనూ ఇంటర్ పరీక్షల మూల్యాకనం చేసి ఫలితాలు విడుదల చేయడం చారిత్రాత్మకమని అన్నారు.
దేశంలోనే ఇంటర్మీడియట్ ఫలితాలను విడుదల చేసిన ఘనత ఏపీదేనని ఆయన అన్నారు.
పరీక్షలు నిర్వహించినా ఫలితాల విడుదల విషయంలో పలు సవాళ్లను ఎదుర్కొన్నా వాటిని అధిగమించామని చెప్పారు.
తాజా స్వస్థ (ఆరోగ్యం జాగ్రత్తలు) కోసం : https://www.vaartha.com/specials/health/