ఏపీ ప్రయోజనాలను కెసిఆర్ దెబ్బతీశారుః జీవీఎల్ నరసింహారావు
క్షమాపణలు చెప్పిన తర్వాతే కెసిఆర్ ఏపీలో అడుగు పెట్టాలి..
అమరావతిః బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ ఏపీలో కూడా పార్టీని విస్తరించే అంశంపై పూర్తి స్థాయిలో దృష్టిని సారించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కెసిఆర్ పై బిజెపి రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శలు గుప్పించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కెసిఆర్ తిట్టిన తిట్లను, చేసిన అవమానాలను ఏపీ ప్రజలు ఇప్పటికీ మరిచిపోలేదని చెప్పారు. ఏపీ ప్రయోజనాలను దెబ్బ తీసింది కెసిఆర్ అనే విషయాన్ని రాష్ట్రంలోని పిల్లలను అడిగినా చెపుతారని అన్నారు.
ఏపీ ప్రజలకు క్షమాపణ చెప్పిన తర్వాతే ఆయన రాష్ట్రంలోకి అడుగు పెట్టాలని డిమాండ్ చేశారు. ఏపీ గురించి తాను చేసిన వ్యాఖ్యలకు సిగ్గుపడుతున్నానని చెప్పి, తల వంచి క్షమాపణ చెప్పాలని అన్నారు. బిజెపి నుంచి బిఆర్ఎస్ లోకి ఎవరూ వెళ్లరని తెలిపారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/category/news/national/