ఏపీ ఉద్యోగుల‌కు మళ్లీ మొండిచేయి చూపించిన జగన్

cm jagan

ఏపీ ఉద్యోగుల‌కు మళ్లీ మొండిచేయి చూపించాడు ముఖ్యమంత్రి జగన్. ఉగాది సందర్బంగా ఒకటో తారీఖున జీతాలు పడతాయని అంత అనుకున్నారు కానీ ఈసారి కూడా పడలేదు. ఈ నెల కూడా వేత‌నాలు 6,7 తేదీల్లో అందనున్నాయ‌న్న వార్తలు వినిపిస్తున్నాయి. ప్రతిసారి నిధులు లేవని అందుకే ..ఆలస్యం అవుతుందని చెపుతూ వచ్చిన సర్కార్…ఈసారి మాత్రం కొత్త స‌మ‌స్య వ‌ల్లే ఆలస్యం అవుతుందని తెలిపారు.

టీడీపీ హ‌యాంలో సీఎఫ్ఎంఎస్‌ పేరిట కొత్త‌గా తీసుకువ‌చ్చిన విధానం ద్వారా వేత‌నాలు చెల్లించే వారన్న విష‌యం తెలిసిందే. అయితే ఇప్పుడు వైసీపీ స‌ర్కారు ఆ సాఫ్ట్ వేర్‌ను మార్చేసి.. టీడీపీ హ‌యాం కంటే ముందు ఉన్న హెచ్ఆర్ఎంఎస్ విధానం ద్వారానే వేత‌నాలు ఇవ్వాల‌ని నిర్ణ‌యించింద‌ట‌.

ఇందుకోసం పేరోల్ హెర్బ్ పేరిట ఏపీ ప్ర‌భుత్వం కొత్త సాఫ్ట్‌వేర్‌ను తీసుకొచ్చింద‌ట‌. ఈ సాఫ్ట్‌వేర్ ఇంకా ఆర్బీఐతో అనుసంధానం కాలేద‌ట‌. అంతేకాకుండా పాత విధానంలో బిల్లుల అప్‌లోడ్ ఇంకా పూర్తి కాలేద‌ట‌. హెచ్ఆర్ఎంఎస్ విధానంలో బిల్లుల అప్‌లోడ్ ఇంకా కొన‌సాగుతోంద‌ని, అది పూర్త‌య్యే స‌రికి ఈ నెల 5వ తేదీ రానుంద‌ని స‌మాచారం. ఈ లెక్క‌న ఈ నెల 6గానీ, 7వ తేదీన గానీ ఉద్యోగుల‌కు వేత‌నాలు అందే అవ‌కాశాలున్నాయ‌ని ప్ర‌భుత్వ‌ వ‌ర్గాలు చెబుతున్నాయి.