నేడే ఏపీ పరిషత్ ఎన్నికల ఫలితాలు..

ఏపీలో జరిగిన 10 జెడ్పీటీసీ, 123 ఎంపీటీసీ స్థానాల ఎన్నికల ఫలితాలను ఈరోజు ప్రకటించనున్నారు. మున్సిపల్‌, పంచాయత్‌ ఎన్నికల ఫలితాల్లో వైసీపీ విజయ ఢంకా మోగించగా..ఈ పరిషత్ ఎన్నికల ఫలితాల్లో కూడా అదే రిపీట్ అవుతుందని వైసీపీ ధీమా వ్యక్తం చేస్తుంది. ఉదయం 8 గంటల నుండే ఈ కౌటింగ్ మొదలుపెట్టారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. మంగళవారం ఎన్నికలు జరిగిన 10 జెడ్పీటీసీ, 123 ఎంపీటీసీ స్థానాల ఓట్లను గురువారం లెక్కింపు ప్రక్రియను ప్రారంభించారు.

మొత్తం 14 జడ్పీటీసీల్లో 04 ఏకగ్రీవం కాగా.. 10 స్థానాలకు కౌంటింగ్ జరుగుతుంది. 176 ఎంపీటీసీ స్థానాల్లో 50 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన స్థానాల్లో కౌంటింగ్‌ కొనసాగుతోంది. ఎంపీటీసీ స్థానాల్లో ఫలితాలు ఉదయం పది గంటలకు తేలతాయని, జెడ్పీటీసీ స్థానాల్లో మధ్యాహ్నం 12 గంటలకల్లా తుది ఫలితం వెల్లడించే అవకాశం ఉందని సమాచారం.