కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఘన స్వాగతం పలికిన మంత్రి రోజా
రాష్ట్రంలో పర్యాటకాభివృద్ధిపై చర్చ
అమరావతి : ఏపీ పర్యాటక శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆర్కే రోజా పలువురు ప్రముఖులను వరుసబెట్టి కలుస్తున్నారు. అందులో భాగంగా శనివారం విశాఖ వచ్చిన కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డితోనూ ఆమె భేటీ అయ్యారు. అధికారిక పర్యటన నిమిత్తం విశాఖ వచ్చిన కిషన్ రెడ్డికి విమానాశ్రయంలో రోజా ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏపీలోని పర్యాటక ప్రాంతాల అభివృద్ధిపై వారిద్దరూ చర్చించారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/