ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం
అమరావతి: ఏపీ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి(49) హఠాన్మరణం చెందారు. గుండెపోటుతో నిన్న హైదరాబాద్లోని అపోలో ఆస్పత్రిలో చేరిన గౌతమ్ రెడ్డి చికిత్స పొందుతూ సోమవారం ఉదయం కన్నుమూశారు. వారం రోజులపాటు దుబాయ్ ఎక్స్పోలో పాల్గొన్న గౌతమ్ రెడ్డి.. రెండు రోజుల క్రితమే హైదరాబాద్కు చేరుకున్నారు. గౌతమ్ రెడ్డి మృతితో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆయన కుటుంబ సభ్యులతో పాటు వైస్సార్సీపీ నేతలు తీవ్ర దిగ్ర్భాంతికి గురయ్యారు.
కాగా, 2014 అసెంబ్లీ ఎన్నికలతో గౌతమ్ రెడ్డి రాజకీయ అంరగేట్రం చేశారు. ఆ ఎన్నికల్లో నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం నుంచి తొలిసారి పోటీ చేసి గెలిచారు. 2019 ఎన్నికల్లోనూ రెండోసారి ఆత్మకూరు నుంచి గెలుపొందారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/