నిధులు లేక ముత్తుకూరు రోడ్డు పూర్తి కాలేదు: ఏపీ మంత్రి జయరాం
ఆగస్టు 15 తరువాతపెండింగ్ పనులన్నీ పూర్తి చేస్తాం: మంత్రి జయరాం
అమరావతిః ఏపిలో రోడ్ల పరిస్థితి కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరాం కీలక వ్యాఖ్యలు చేశారు. కర్నూలు జిల్లా ఆస్పరి మండలం ముత్తుకూరు గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన ఈరోజు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..నిధులు లేకపోవడం వల్లే ముత్తుకూరు రోడ్డు పూర్తి కాలేదని తెలిపారు. ఆలూరు నియోజకవర్గంలో 40 రోడ్లు పాడయ్యాయని చెప్పారు. ఆగస్ట్ నెలలో రూ. 2 వేల కోట్లు వస్తాయని ముఖ్యమంత్రి జగన్ చెప్పారని… నిధులు రాగానే ఆగస్ట్ 15 తర్వాత రోడ్ల రిపేర్లకు సంబంధించి పెండింగ్ పనులన్నీ పూర్తి చేస్తామని ప్రజలకు వివరించారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/news/national/