పింఛన్ల సంఖ్యను తగ్గించాలన్న ఆలోచన మాకు లేదు

మా ప్రభుత్వంపై బురదజల్లాలని బాబు చూస్తున్నారు

botsa satyanarayana
botsa satyanarayana

అమరావతి: మంత్రి బొత్స సత్యనారాయణ ఈరోజు సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఏడు లక్షల పెన్షన్లు తొలగించామని టిడిపి అధినేత చంద్రబాబునాయుడు దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. తమ ప్రభుత్వంపై బురదజల్లాలని చంద్రబాబు చూస్తున్నారని, రాజకీయ లబ్ధి కోసం ఆయన చేస్తున్నదుష్ప్రచారాన్ని నమ్మొద్దని ప్రజలను కోరారు. పింఛన్ల సంఖ్యను తగ్గించుకోవాలన్న ఆలోచన తమ ప్రభుత్వానికి లేదని చెప్పారు. కొత్తగా ఆరు లక్షల మందికి పైగా పింఛన్లు ఇచ్చామని, పాతవారిలో 4,16,034 మందిని పింఛన్లకు అనర్హులుగా గుర్తించామని, పున:పరిశీలన చేసి ఇందులో పింఛన్లకు అర్హులైన వారు ఉంటే ఇస్తామని, ఈ విషయమై వార్డు వాలంటీర్లు ప్రస్తుతం తనిఖీలు చేస్తున్నారని అన్నారు. ఈ ప్రభుత్వం పేదల కోసం ఉన్న ప్రభుత్వం అని, పేదలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం అంకితభావంతో పనిచేస్తుందని చెప్పారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/