ఏపిలో వరదలపై మంత్రి అనిల్‌ కుమార్‌ సమీక్ష

Anil-kumar
Anil-kumar

అమరావతి: ఏపి నీటి పారుదలశాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌ రాష్ట్రంలో వరదలపై సమీక్ష నిర్వహించారు. భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా ఎగువ రాష్ట్రాల నుంచి వరద వస్తూ ఉండటంతో అధికారులను అప్రమత్తంగా ఉండాలని మంత్రి తెలిపారు. వివిధ ప్రాజెక్టుల్లో సమస్యలు, చెరువులకు గండ్లు, కృష్ణగుంటూరు జిల్లాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆయన పలు సూచనలు చేశారు. ఈ సమాశానికి నీటి పారుదల శాఖ ప్రధాన‌ ఇంజనీర్‌, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/