నేడు జడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల స్వీకరణ
నోటిఫికేషన్లు ప్రకటించి వెంటనే నామినేషన్ల ప్రక్రియ
అమరావతి: ఏపిలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగిన విషయం తెలిసిందే. అయితే సోమవారం ప్రప్రథమంగా జిల్లా, మండల పరిషత్తు పరిధిల్లోని స్థానాలకు నోటిఫికేషన్ వెలువడనుంది. కేవలం మూడు రోజులు మాత్రమే నామినేషన్ల దాఖలుకు గడువు విధించారు. దీంతో తొలి రోజు నుంచే నామినేషన్ల తాకిడి ఎక్కువగా ఉంటుందని అధికారవర్గాలు అంచనా వేస్తోన్నాయి. అందుచేత రిటర్నింగ్ అధికారులు తమ కార్యాలయాల్లో అందుబాటులో ఉండి నోటిషికేషన్ ప్రకటించి ఆ వెంటనే నామినేషన్లు స్వీకారించాలని అధికారులు సూచించారు.
తాజా క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/sports/