ప్రారంభమైన ఏపి శాసనమండలి సమావేశాలు
భారత్-చైనా సరిహద్దులో మృతి చెందిన జవాన్లకు సంతాపం
అమరావత: రెండో రోజు ఏపి శాసన మండలి సమావేశాలు ప్రారంభమయ్యాయి. సీఆర్డీఏ రద్దు, వికేంద్రీకరణ బిల్లులు మండలి ముందుకు వచ్చినట్టు మండలిలో చైర్మన్ షరీఫ్ ప్రస్తావించారు. భారత్-చైనా సరిహద్దులో మృతి చెందిన వీర జవాన్లకు సంతాప తీర్మానం తెలుపుదామని బిజెపి ఎమ్మెల్సీ మాధవ్ కోరారు. అయితే బడ్జెట్ పై చర్చ మొదలు పెట్టి.. ఆ తర్వాత బిల్లులపై చర్చ చేపడదామన్న ఛైర్మన్ షరీఫ్ తెలిపారు. ఆపై శాసన మండలిలో బడ్జెట్పై చర్చ ప్రారంభమైంది.
తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/business/