కొత్త వేతన స్కేల్ ప్రకారం జనవరి జీతాలు
ఆర్థిక శాఖ వెల్లడి
Amaravati: పీఆర్సీ జీవోలను వెనక్కి తీసుకోకుంటే సమ్మెకు దిగుతామని ప్రభుత్వానికి ఉద్యోగ సంఘాలు సమ్మె నోటీస్ ఇచ్చిన నేపథ్యంలో , కొత్త పీఆర్సీ ప్రకారం జీతాలు ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. మంగళవారం ఉద్యోగుల ఖాతాల్లో జీతాలు జమ చేయాలని భావిస్తోంది. జనవరి నెల జీతాలను కొత్త వేతన స్కేలు ప్రకారం అమలు చేసిననట్లు ఆర్ధిక శాఖ వెల్లడించింది. ఉద్యోగులు, పెన్షనర్లు తమ పే స్లిప్లను సీఎఫ్ఎంఎస్ వెబ్ సైట్ ద్వారాగానీ, మొబైల్ యాప్ ద్వారాగానీ డౌన్లోడ్ చేసుకోవచ్చని పేర్కొంది . ప్రతీ ఉద్యోగి మొబైల్ ఫోన్ కు కూడా వేతనానికి సంబంధించిన సంక్షిప్త సమాచారం కూడా పంపామని వెల్లడించింది.
తెలంగాణ వార్తల కోసం: https://www.vaartha.com/telangana/