నేడు ఏపీలో ఇంటర్​ పరీక్షల ఫలితాలు విడుదల

అమరావతి: నేడు ఏపీలో ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ మధ్యాహ్నం 12.30 గంటలకు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ.. విజయవాడలో ఇంటర్‌ ఫలితాలు విడుదల చేస్తారు. మే 6 నుంచి 25 వరకు జరిగిన ఇంటర్‌ పరీక్షలకు 9లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. ఫలితాలను మంత్రి బొత్స ప్రకటించిన తర్వాత www.bie.ap.gov.in, https://examresults.ap.nic.in వెబ్‌సైట్‌లలో పొందవచ్చు.

కాగా, పదోతరగతి పరీక్షల్లో ఫెయిలై అడ్వాన్సుడ్​ సప్లిమెంటరీ పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు పరీక్ష ఫీజు చెల్లింపు నుంచి ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. ఫెయిల్​ అయిన 2,01,627 మంది విద్యార్థులకూ హాల్​టికెట్లు జారీ చేయనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు దేవానందరెడ్డి తెలిపారు. హాల్​టికెట్లను వెబ్​సైట్​లో పెడతామని పేర్కొన్నారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/