ఆన్ లైన్ సినిమా టికెట్ల విక్రయంపై స్టే విధించిన హైకోర్టు

Ap High Court
ap-high-court

అమరావతి : ఏపీ సర్కార్‌ కు హైకోర్టు ఝలక్ ఇచ్చింది. సినిమా టికెట్ల మొత్తాన్ని ఆన్‌లైన్‌ లో విక్రయించాలని రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 69ని హైకోర్టు నిలిపివేసింది. జీవో నెంబర్ 69 పై హైకోర్టు స్టే విధించింది. జీవో నెంబర్ 69 పై తదనంతర చర్యలు తీసుకోవద్దని ఆదేశాలు జారీ చేసింది. జీవో నెంబర్ 69 ని సవాల్ చేస్తూ హైకోర్టులో బుక్ మై షో, మల్టీప్లెక్స్లు విజయవాడ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ పిటిషన్లు దాఖలు చేసింది. రెండు రోజులపాటు వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం.. మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. ఈ కేసును ఈ నెల 27వ తేదీకి కేసు విచారణను వాయిదా వేసింది.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/movies/