ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై తీర్పును రిజర్వ్ లో ఉంచిన హైకోర్టు

అమరావతి : ఇటీవల ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించినా కోర్టు ఆదేశాల మేరకు ఓట్ల లెక్కింపు నిర్వహించలేదు. ఈ నేపథ్యంలో, పరిషత్ ఎన్నికలపై దాఖలైన పిటిషన్లపై ఏపీ హైకోర్టులో నేడు వాదనలు పూర్తయ్యాయి. న్యాయస్థానం తీర్పును రిజర్వ్ లో ఉంచింది.

గతంలో పరిషత్ ఎన్నికలపై సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును ప్రభుత్వం డివిజన్ బెంచ్ కు అప్పీల్ చేసింది. అప్పట్లో ఎన్నికలకు తగిన సమయం లేకుండా నోటిఫికేషన్ ఇచ్చారని, ఇది సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధమని పేర్కొన్న సింగిల్ బెంచ్ న్యాయమూర్తి జస్టిస్ దుర్గాప్రసాదరావు ఎన్నికలు రద్దు చేశారు. దాంతో ఏపీ ప్రభుత్వం హైకోర్టు డివిజన్ బెంచ్ ను ఆశ్రయించింది. ఈ అప్పీల్ పై హైకోర్టు డివిజన్ బెంచ్ విచారణ చేపట్టింది. ఇరు పక్షాల వానదలు విన్న పిమ్మట తీర్పును తర్వాత వెల్లడించాలని నిర్ణయించింది.

తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/business/