కార్యాలయాల తరలింపుపై విచారణ 11కు వాయిదా

Andhra Pradesh High Court
Andhra Pradesh High Court

అమరావతి: ఏపి రాజధాని అమరావతి నుంచి కర్నూలుకు కార్యాలయాల తరలింపుపై హైకోర్టు విచారణ మరోసారి వాయిదా వేసింది. నేడు అమరావతి నుంచి కార్యాలయాల తరలింపుపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. అఫిడవిట్ దాఖలు చేయాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాగే వాదనలకు సంబంధించిన డాక్యుమెంట్లు ఇవ్వాలని పిటిషనర్లను ఆదేశించింది. డాక్యుమెంట్లు లేకుండా ఓరల్ ఆర్గ్యుమెంట్ చేయడం సరికాదని హైకోర్టు తెలిపింది. ఏ కారణాలతో ఆఫీసులను తరలిస్తున్నారో అఫిడవిట్ దాఖలు చేయాలని తెలిపింది. తదుపరి విచారణను హైకోర్టు 11వతేదీకి వాయిదా వేసింది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/